‘ఫిట్నెస్’పై 24న ప్రధాని ముఖాముఖి
ABN , First Publish Date - 2020-09-22T09:38:00+05:30 IST
ఫిట్ ఇండియా ఉద్యమం ఊపిరి పోసుకొని ఈనెల 24కు ఏడాది కానుంది.
న్యూఢిల్లీ: ఫిట్ ఇండియా ఉద్యమం ఊపిరి పోసుకొని ఈనెల 24కు ఏడాది కానుంది. ఈ సందర్భంగా ఫిట్నెస్పై ఆన్లైన్లో జరిగే చర్చలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఫిట్నెస్కు అగ్ర ప్రాధాన్యం ఇచ్చే టీమిండియా కెప్టెన్ కోహ్లీ, మోడల్ మిలింద్ సోమన్, ఇతర పౌరులతో ఆయన ముచ్చటించనున్నారు.