ఉక్రెయిన్‌లో దుర్మరణం పాలైన విద్యార్థి కుటుంబానికి ప్రధాని పరామర్శ

ABN , First Publish Date - 2022-03-01T23:51:24+05:30 IST

రష్యా బాంబు దాడిలో, ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి శేఖరప్ప నవీన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. నవీన్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ సానుభూతి వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌లో దుర్మరణం పాలైన విద్యార్థి కుటుంబానికి ప్రధాని పరామర్శ

రష్యా బాంబు దాడిలో, ఉక్రెయిన్‌లో దుర్మరణం పాలైన భారతీయ విద్యార్థి శేఖరప్ప నవీన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. నవీన్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజు బొమ్మై కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నవీన్ కుటుంబం తనకు చాలాకాలం నుంచి తెలుసని, విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదే ఘటనలో కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారని బొమ్మై చెప్పారు. విద్యార్థి మృతదేహంతోపాటు బాధితులను ఇండియా తీసుకొచ్చే విషయంలో సహకరించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి, విదేశీ వ్యవహారాల శాఖను బొమ్మై కోరారు. నవీన్ మృతిపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ సంతాపం వ్యక్తం చేశారు.







Updated Date - 2022-03-01T23:51:24+05:30 IST