మోదీ హెలికాఫ్టర్కు అనుమతివ్వని ఏవియేషన్ అధికారులు
ABN , First Publish Date - 2022-05-26T21:25:22+05:30 IST
హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట వెళ్లేందుకు
హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట వెళ్లేందుకు హెలికాఫ్టర్లో వెళ్లాల్సి ఉండగా ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీగా ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు పలు చోట్ల వాన కూడా పడింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మోదీ హెలికాఫ్టర్కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రధాని మోదీ రోడ్డు మార్గం గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి చెన్నై బయలుదేరారు.