నగరంలో ప్రధాని మోదీ పర్యటన..ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-06-30T17:40:28+05:30 IST

జగదాంబ మహంకాళి బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఒక

నగరంలో ప్రధాని మోదీ పర్యటన..ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: జగదాంబ మహంకాళి బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ వెళ్లే మక్కాయిదర్వాజా, లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వెళ్లే ఫతేదర్వాజా, షేక్‌పేట నాలా, సెవెన్‌టూంబ్స్‌ నుంచి వెళ్లే బంజారా దర్వాజాల ద్వారా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి. 

 మక్కాయి దర్వాజా నుంచి కోటలోకి వచ్చే భక్తులు తమ ద్విచక్రవాహనాలను అశూర్‌ఖానా నుంచి మిలిటరీ శానిటరీ పాయింట్‌ వరకు పార్కింగ్‌ చేసుకోవాలి. కార్లకు ఏఓసీ సెంటర్‌ గ్రౌండ్‌లో స్థలాన్ని కేటాయించారు.

 లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండలోకి వెళ్లే భక్తులు తమ బైకులు, ఆటోలను హుడా పార్క్‌లో నిలపాల్సి ఉంటుంది. కార్లకు ఒవైసీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో స్థలాన్ని కేటాయించారు.

Updated Date - 2022-06-30T17:40:28+05:30 IST