26న హైదరాబాద్కు ప్రధాని మోదీ?
ABN , First Publish Date - 2022-05-17T10:36:48+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది.
ఐఎస్బీ ద్విదశాబ్ది వేడుకలకు హాజరు
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐఎ్సబీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.