26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ?

ABN , First Publish Date - 2022-05-17T10:36:48+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది.

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ?

ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలకు హాజరు 

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐఎ్‌సబీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

Updated Date - 2022-05-17T10:36:48+05:30 IST