ప్రధాని ముందే నిధుల సంగతి తేలుద్దాం: Bandi Sanjay
ABN , First Publish Date - 2021-09-19T01:33:31+05:30 IST
సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళ్దాం..
కామారెడ్డి: సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళ్దాం.. నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వడం లేదని.. అన్యాయం చేస్తోందని నిరూపిస్తే అక్కడికక్కడే నా పదవులకు రాజీనామా చేస్తా. ఒకవేళ కేంద్రమే నిధులు ఇస్తోందని నిరూపిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కొందరు పనిలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే టీఆర్ఎస్ కేప్టెన్ అయితే ఎంఐఎం వైస్ కెప్టెన్, కాంగ్రెస్ నేతలు ఎక్స్ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లన్నారు. టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వలస వెళ్లింది ఆ పార్టీ వాళ్లేనని బండి సంజయ్ దుయ్యబట్టారు.