దుకాణాల్లో ధరల పరిశీలన
ABN , First Publish Date - 2020-03-28T10:39:11+05:30 IST
కూరగాయల దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు సాగుతున్నదీ లేనిది రెవెన్యూ అధికారులు...
వీరవాసరం, మార్చి 27: కూరగాయల దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు సాగుతున్నదీ లేనిది రెవెన్యూ అధికారులు శుక్ర వారం పరిశీలించారు. గ్రామాల్లో కూరగాయల దుకాణాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో కూరగాయాలు ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో గ్రామ పంచాయతీ అధికారులు దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కేవీ.చంద్రశేఖరరావు, వీఆర్వోల బృందం కూరగాయల ధరలను పరిశీలించింది. వీరవాసరం పెదదళితపేట ప్రాంతాలకు పైపులైన్ దెబ్బ తినడంతో ట్యాంకర్ ద్వారా తాగునీరును అందజేశారు.