ఎమ్మెల్యే దౌర్జన్యానికి అడ్డుకట్టవేయండి

ABN , First Publish Date - 2021-10-24T06:10:37+05:30 IST

శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వారి కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు అడ్డుకట్టు వేయాలని టీడీపీ నియోజ కవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణీశ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే దౌర్జన్యానికి అడ్డుకట్టవేయండి


: టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణీశ్రీ

బుక్కరాయసముద్రం, అక్టోబరు23: శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వారి కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు అడ్డుకట్టు  వేయాలని టీడీపీ నియోజ కవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణీశ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని కొర్రపాడు గ్రామంలో రైతు నరసింహారెడ్డికి జరిగిన అన్యాయం ఘటనను ఆమె శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అధికా రం అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో దందాలకు పాల్పడుతు న్నారని ఆరోపించారు. పచ్చని పంట పొలాన్ని దున్నివేసి దౌర్జన్యంగా రోడ్డు వేయడం తీవ్ర అన్యాయమన్నారు.  


Updated Date - 2021-10-24T06:10:37+05:30 IST