ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టండి

ABN , First Publish Date - 2021-12-06T05:54:11+05:30 IST

వరిధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టండి
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

జగిత్యాల జిల్లాలో రైతుల రాస్తారోకో

మల్లాపూర్‌, డిసెంబరు 5 : వరిధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు తాలు, తప్ప పేరిట 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపులోనూ, కొనుగోళ్లలోనూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్‌, అధికారులు రావాలని, తమకు వివరణ ఇవ్వాలని రైతులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవీందర్‌, సొసైటీ చైర్మన్‌ నర్సారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లతో మాట్లాడి ఇబ్బందులు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

Updated Date - 2021-12-06T05:54:11+05:30 IST