అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక యూఏఈ వాటర్‌ ఫాల్స్‌ గ్లోబల్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-07-07T08:47:04+05:30 IST

కొవిడ్‌ సమయంలో అందించిన సేవలకుగాను అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ యూఏఈ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘వాటర్‌ ఫాల్స్‌ గ్లోబల్‌’ అవార్డును సొంతం చేసుకుంది.

అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక యూఏఈ వాటర్‌ ఫాల్స్‌ గ్లోబల్‌ అవార్డు

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో అందించిన సేవలకుగాను అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ యూఏఈ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘వాటర్‌ ఫాల్స్‌ గ్లోబల్‌’ అవార్డును సొంతం చేసుకుంది. కొవిడ్‌ విస్తరిస్తున్న తరుణంలో ఎక్కువ మందికి సేవలందించిన ఆస్పత్రిగా అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌కు ఈ అవార్డును అందించారు. యూఏఈలోని ఖసర్‌ అల్‌ బహర్‌ మజ్లిస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యూఏఈ ప్రెసిడెంట్‌, రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రత్యేక అతిథిగా హాజరై అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్‌ ఆస్పత్రుల ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. అపోలో హాస్పిటల్స్‌ అందించిన సేవలకు యూఏఈ ప్రభుత్వం తరఫున దక్కిన గుర్తింపు ఇది అని అన్నారు. అపోలో హాస్పిటల్స్‌ ఫౌండర్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి నేతృత్వంలో మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినట్టు తెలిపారు. 

Updated Date - 2022-07-07T08:47:04+05:30 IST