కేసీఆర్‌ చొరవతోనే పూర్వవైభవం: మందా

ABN , First Publish Date - 2021-07-24T04:54:06+05:30 IST

రాష్ట్రంలోని ఆలయాలన్నింటికీ కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వచ్చిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు.

కేసీఆర్‌ చొరవతోనే పూర్వవైభవం: మందా

 పాలమూరు, జూలై 23: రాష్ట్రంలోని ఆలయాలన్నింటికీ కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వచ్చిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్మ ఆలయాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మందా ఎల్లమ్మకు పూజలు చేశారు. ఆయన వెంట తనయుడు మంద శ్రీనాథ్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్‌, జయన్న, కృష్ణ, రాము, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:54:06+05:30 IST