ప్రైవేట్‌ టీచర్లపై ఒత్తిడి

ABN , First Publish Date - 2020-05-22T10:44:26+05:30 IST

లాక్‌డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను పాఠశాలల యాజమాన్యం నిత్యం

ప్రైవేట్‌ టీచర్లపై ఒత్తిడి

రోజూ ఐదు అడ్మిషన్లు చేయించాలి 

యాజమాన్యం బెదిరింపు


బౌద్ధనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను పాఠశాలల యాజమాన్యం నిత్యం వత్తిడికి గురిచేస్తున్నారు. రెండునెలల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు మూసి ఉండటంతో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యం సగం జీతాన్నే ఇచ్చింది. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు అప్పజెప్పటంతో పాటు పిల్లలను స్కూలులో చేర్పించే బాధ్యతను అప్పజెప్పింది.


విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తమ పాఠశాలలో పిల్లలను చేర్పించే బాధ్యతను అట్టగట్టింది. ప్రతీరోజు స్కూలుకు ఐదు అడ్మిషన్లు తీసుకురావాలని, లేనిపక్షంలో టీచర్లను ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పనిచేసే ఓ టీచర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2020-05-22T10:44:26+05:30 IST