హైదరాబాద్‌కు రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-02-13T20:45:46+05:30 IST

హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానం విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.

హైదరాబాద్‌కు రాష్ట్రపతి

హైదరాబాద్: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానం విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్రపతి ముచ్చింతల్‌ బయల్దేరారు. ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన రామానుజ సువర్ణమూర్తి విగ్రహాన్ని ఆయన తొలిదర్శనంతో ఆవిష్కరించనున్నారు. 

Updated Date - 2022-02-13T20:45:46+05:30 IST