రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐకి తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం
ABN , First Publish Date - 2022-01-02T03:16:28+05:30 IST
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో పాటు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం అందించారు. ఏపీ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన అర్చకులు... రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ నివాసాల్లో ..
న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో పాటు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం అందించారు. ఏపీ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన అర్చకులు... రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ నివాసాల్లో వారిని కలిసి వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం తొలి రోజున తిరుపతి, శ్రీశైలం ఆలయాల ప్రసాదాలను అందజేయడం అనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా పూజారులు తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు అందజేశారు.