ఐపీఎస్ డీ రూప: 20 ఏళ్లలో 40 సార్లు బదిలీ... రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారం!

ABN , First Publish Date - 2021-01-03T14:58:42+05:30 IST

ఐపీఎస్ అధికారి డీ రూప తన 20 ఏళ్ల కెరియర్‌లో 40 సార్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం

ఐపీఎస్ డీ రూప: 20 ఏళ్లలో 40 సార్లు బదిలీ... రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారం!

బెంగళూరు: ఐపీఎస్ అధికారి డీ రూప తన 20 ఏళ్ల కెరియర్‌లో 40 సార్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం బెంగళూరు సేఫ్ సిటీ ప్రాజెక్టుకు చెందిన టెండర్ ప్రక్రియలో చోటు చేసుకున్న కోట్లది రూపాయల కుంభకోణంలో డీ రూప తన పైఅధికారి హేమంత్ నింబల్‌కర్‌పై ఆరోపణలు చేశారు. దీని తరువాత డీ రూపను హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంనకు బదిలీ చేశారు. రూప తన ఆరోపణల్లో... టెండరింగ్ కమిటీ చీఫ్ అయిన నింబల్‌కర్ నిబంధనలు ఉల్లంఘించి, ఒక ప్రమఖ కమిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై దీనిపై స్పందించిన నింబల్‌కర్... ఎటువంటి అధికారం లేకుండా డీ రూప ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. అయితే తాను ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కార్యదర్శి తనకు అధికారం కల్పించారని రూప చెబుతున్నారు. కాగా డీ రూప రాష్ట్ర హోం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. 


రాష్ట్రంలో ఈ పదవిని చేపట్టిన మహిళగా డీ రూప నిలిచారు. తనకు మరోమారు బదిలీ అయిన నేపధ్యంలో డీ రూప ఒక ట్వీట్‌లో స్పందించారు. బదిలీ చేయడమనేది ప్రభుత్వ ఉద్యోగంలో భాగమని అన్నారు. తన కెరియర్‌ కన్నా రెండింతలుగా తనను బదిలీ చేశారని రూప తెలిపారు. అయితే తన వ్యక్తిత్వంలో ఎటువంటి మచ్చలేదన్నారు. చాలామంది అధికారులు తాము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారు ఏ విషయాన్నీ చర్చించరు. అయితే తాను అలా ఉండలేనని, విధి నిర్వహణలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వాటిని తీసుకుంటానని ఆ ట్వీట్‌లో  పేర్కొన్నారు. కాగా మూడేళ్ల క్రితం డీ రూప పేరు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితులరాలు వీ కే శశికళపై పలు ఆరోపణలు చేశారు. కర్నాటక జైలులో అధికారులతో పాటు తనిఖీలు నిర్వహించారు. ఇది వివాదాస్పదమైన నేపధ్యంలో డీ రూపపై రూ. 10 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం కేసు నమోదైంది. డీ రూప 2000వ సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆమె 2016, 2017లలో పోలీసు విభాగంలో అందించే రాష్ట్రపతి పురస్కారాలను కూడా అందుకున్నారు. తన 20 ఏళ్ల కెరియర్‌లో 40 సార్లు బదిలీ అయ్యారు.

Updated Date - 2021-01-03T14:58:42+05:30 IST