మహిళా జడ్జిల నియామకంపై రాష్ట్రపతి హర్షం

ABN , First Publish Date - 2021-09-11T20:38:32+05:30 IST

భారత అత్యున్నత న్యాయస్థానంలో తాజాగా ముగ్గురు మహిళా జడ్జిలను నియమించడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. తాజా నియామకంతో సుప్రీంకోర్టులో మహిళ జడ్జిల సంఖ్య నాలుగు పెరిగిందని ఆయన గుర్తు చేశారు...

మహిళా జడ్జిల నియామకంపై రాష్ట్రపతి హర్షం

లఖ్‌నవూ: భారత అత్యున్నత న్యాయస్థానంలో తాజాగా ముగ్గురు మహిళా జడ్జిలను నియమించడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉన్నారని, తాజా నియామకంతో సుప్రీంకోర్టులో మహిళ జడ్జిల సంఖ్య నాలుగు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంలో ఇంత మంది మహిళా జడ్జిలు ఉండడం ఇదే మొదటిసారి అని, ఈ సంఖ్య మరింతకు పెరగాలని అన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్‌లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి పునాది వేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అలహాబాద్ కోర్టు సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాధాన్యాన్ని వివరించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా న్యాయవాది (1921) కార్నెలియో నోరాబ్జీ పని చేసింది అలహాబాద్ హైకోర్టులోనేనని గుర్తు చేసిన ఆయన మహిళా సాధికారతలో అలహాబాద్ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొనియాడారు.

Updated Date - 2021-09-11T20:38:32+05:30 IST