కమిషనర్‌కు సమ్మెనోటీసు అందజేత

ABN , First Publish Date - 2022-01-28T04:48:28+05:30 IST

న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరు తూ గురువారం మున్సిపల్‌ వర్క ర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీఓ ప్రతులను దగ్ధం చేసి కమిషనర్‌ కృష్ణారెడ్డికి కార్మికు లు సమ్మెనోటీసు అందించారు.

కమిషనర్‌కు సమ్మెనోటీసు అందజేత
కమిషనర్‌కు సమ్మెనోటీసు అందజేస్తున్న కార్మికులు

బద్వేలు, జనవరి 27: న్యాయమైన  కోర్కెలు పరిష్కరించాలని కోరు తూ గురువారం మున్సిపల్‌ వర్క ర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీఓ ప్రతులను దగ్ధం చేసి కమిషనర్‌ కృష్ణారెడ్డికి కార్మికు లు సమ్మెనోటీసు అందించారు. మునిసిపాలిటీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు మేరువ మల్లికార్జున, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు నాగే్‌ష మాట్లాడుతూ కార్మికుల కోర్కెల సాధన కోసం పదేళ్లగా పనిచేస్తున్న కార్మికుల సర్వీసుపై పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని కోరారు. జీతాల్లో ఈఎ్‌సఐను కట్‌ చేస్తున్నా కార్మికునికి పనిచేయడం లేదన్నారు.

అందుకే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని 24న డీఎంఏ మంగళగిరి వారికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి వెంకటసుబ్బయ్య, గౌరవసలహాదారులు జేవీరమణరావు, సురే్‌షసింగ్‌,  నేతలు గు రయ్య, వెంకటరెడ్డి,నరసింహులు, శ్రీనివాసులు, దేవా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:48:28+05:30 IST