హరితమిత్ర అవార్డులు అందజేత
ABN , First Publish Date - 2021-01-27T05:55:50+05:30 IST
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ హరిజవహర్లాల్ హరితమిత్ర అవార్డులు అందించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ హరిజవహర్లాల్ హరితమిత్ర అవార్డులు అందించారు. జేసీ కిషోర్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సింహాచలం, డీఆర్వో, ఆర్డీవో, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, అటవీ శాఖ అధికారి జానకిరావు, తదితరులు పాల్గొన్నారు.