ఆరోగ్య సిబ్బందికి ప్రశంస పత్రాల అందజేత

ABN , First Publish Date - 2021-01-27T05:14:29+05:30 IST

నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకలలో భాగంగా పలువురు ఆరోగ్య సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. కొవిడ్‌-19 సందర్భంగా కరోనా రోగులకు ప్రత్యేక సేవలందించిన పలువురు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ అభి నందించారు.

ఆరోగ్య సిబ్బందికి ప్రశంస పత్రాల అందజేత
నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకుంటున్న డాక్టర్‌ దేవేంధర్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 26: నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకలలో భాగంగా పలువురు ఆరోగ్య సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. కొవిడ్‌-19 సందర్భంగా కరోనా రోగులకు ప్రత్యేక సేవలందించిన పలువురు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ  అభి నందించారు. కాగా, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది అందించిన సేవలు అనన్య సామాన్యమైనవని ఆయన కొనియాడారు. అవార్డు అందుకున్న వారిలో డాక్టర్‌ మతీముల్లా, యు.అరుణ్‌, నిఖిలా రాణి, డీఎంహెచ్‌వో ఆశీష్‌ రెడ్డి, కొవిడ్‌-19 నోడల్‌ అధికారి డాక్టర్‌ కార్తీక్‌, డాక్టర్‌ స్వప్న ఉన్నారు. అలాగే, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి, రిటైర్డ్‌ డీఎంహెచ్‌వో వసంత్‌రావ్‌, డాక్టర్‌ రత్నాకర్‌రెడ్డి, సి.రవికుమార్‌, వేణుగోపాల కృష్ణ, టి.రజని, భైంసా సూపరింటెండెంట్‌ యు.కాశీనాథ్‌, ఆయుష్‌ మెడికల్‌ అధికారి వెంకటేష్‌లో పాటు పలువురు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టె క్నీషియన్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-01-27T05:14:29+05:30 IST