ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం
ABN , First Publish Date - 2020-07-06T11:02:34+05:30 IST
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 7లోగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల ..
చిత్తూరు సెంట్రల్, జూన్ 5: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 7లోగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలు పంపాలంటూ ఇప్పటికే రాష్ట్ర పాఠశాల విద్య కమిషనరేట్ డీఈవో, డీవైఈవో, ఎంఈవోలకు ఆదేశాలు పంపింది. ఒకే ప్రాంతంలో 8ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్ఎంల వివరాలనూ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు 2012, నవంబరు 18వతేదీకి ముందు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్లు, ల్యాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, ఎస్జీటీలు, క్రాఫ్ట్, ఎల్ఎ్ఫఎల్ హెచ్ఎంలతోపాటు 8ఏళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల వివరాల జాబితా ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంది. దీంతోపాటు 2015, నవంబరు 18వతేదీకి ముందు నుంచే పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల జాబితాను మంగళవారం నాటికల్లా డీఈవో, డీవైఈవో, ఎంఈవోలు అందజేయాల్సి ఉంది.