విద్యుత్తు ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం
ABN , First Publish Date - 2021-01-14T07:52:04+05:30 IST
విద్యుత్తు ఉద్యోగుల విభజన పూర్తికావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో విద్యుత్తు సంస్థలు ఉన్నాయి
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల విభజన పూర్తికావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో విద్యుత్తు సంస్థలు ఉన్నాయి. 1-6-2014 నాటికి మంజూరైన పోస్టుల ఆధారంగా ఎస్పీడీసీఎల్ (హైదరాబాద్) తాత్కాలిక సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పెట్టింది. 476 మంది అదనపు సహాయ ఇంజనీర్లు(ఏఏఈ), 599 మంది సహాయ ఇంజనీర్లు(ఏఈ), 336 మంది సహాయ డివిజనల్ ఇంజనీర్ల(ఏడీఈ)తో ఈ జాబితాను సిద్ధం చేశారు. దీనిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 21వ తేదీలోగా తెలియజేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.