ట్రయల్ రన్కు సిద్ధం!
ABN , First Publish Date - 2022-05-25T06:19:01+05:30 IST
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ముంపు గ్రామాల రైతులు ఒప్పుకోకపోయి నా.. ప్రస్తుతం ఉన్న చెరువు ద్వారానే సాగుకు నీటిని అందించేందుకు నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. కాళేశ్వరం 20, 21వ ప్యాకేజీల ద్వారా రెండు లక్షల ఎకరాలకు
జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ పరిధిలో సాగునీటికి ఏర్పాట్లు
20, 21వ ప్యాకేజీల పరిధిలో సాగునీరు అందించేందుకు కసరత్తు
సారంగపూర్, మెంట్రాజ్పల్లిలో పంప్హౌజ్ల నిర్మాణం పూర్తి
ఈ వారంలోనే ట్రయల్రన్ నిర్వహణ
రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న బాధిత అన్నదాతలు
భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్న ముంపు గ్రామాల రైతులు
2లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు కొనసాగుతున్న పైప్లైన్ల నిర్మాణం
నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో సాగునీరు అందించేందుకు వేగంగా పనులు
నిజామాబాద్, మే 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ముంపు గ్రామాల రైతులు ఒప్పుకోకపోయి నా.. ప్రస్తుతం ఉన్న చెరువు ద్వారానే సాగుకు నీటిని అందించేందుకు నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. కాళేశ్వరం 20, 21వ ప్యాకేజీల ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు పైప్లైన్ల నిర్మాణాలు పూర్తిచేస్తున్నారు. నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం సారంగపూర్, మెంట్రాజ్పల్లి పంప్హౌజ్ల నిర్మాణాలు ఆలస్యమైనా.. ఈ వారంలోనే ట్రయల్రన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్లో ఈ రెండు ప్యాకేజీ ల ద్వారా జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు సా గునీరు అందించేందుకు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే, కాల్వల కు బదులు పైప్లైన్ల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభు త్వ నిర్ణయానికి అనుగుణంగా.. రిజర్వాయర్కు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే భూసేకరణ చేపట్టి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.
పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలి
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు ముం దుకు రావడం లేదు. పాత డిజైన్ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులతో జరిగిన సమావేశంలో తమ విజ్ఞప్తులను ఇస్తూనే.. మం చిప్ప వద్ద పనులను అడ్డుకుంటున్నారు. రిజర్వాయర్ ఎత్తు పెంచకుండా.. మొ దట నిర్ణయించిన విధంగానే నిర్మాణం చేయాలని కోరుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల పథకం కింద 20, 21, 22వ ప్యాకేజీ పనులను చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రం లో వైఎస్ హయాంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఈ మూడు ప్యాకేజీల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు డిజైన్ చేశారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్యాకేజీలను కాళేశ్వరం పథకంలో కలిపారు. ఈ ప్యాకేజీల కింద కాల్వలకు బదులు పైప్లైన్ల ద్వారా సాగునీటిని అందిం చేందుకు రీడిజైన్ చేశారు. దీనిలో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంచేందుకు నిర్ణయించారు. గతంలో ఇచ్చిన 1.5 టీఎంసీలకు బదులు 3.5 టీఎంసీల నీళ్లను నిల్వ చేసేందుకు రీడిజైన్ చేశారు. కేం ద్ర పర్యావరణ, అటవీశాఖల అనుమతులు తీసుకున్నారు. ఈ మంచిప్ప ఎత్తు పెంచి తే 2,400 ఎకరాల వరకు భూములు మునిగిపోతున్నాయి. మంచిప్ప గ్రా మంతో పాటు తొమ్మిది తండాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని భూములు ముంపునకు గురవుతున్నాయి. అంతేకాకుండా.. అటవీ భూమి వెయ్యి ఎకరాలకుపైగా పోతుండగా, రైతుల భూమి 1400 ఎకరాల వరకు ముంపున కు గురవుతోంది. వీటితో పాటు తండాలు నీట మునగనున్నాయి. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న రైతులు పాత డిజైన్ ప్రకారమే నిర్మా ణం చేయాలని కొత్త డిజైన్ను ఆమో దించవద్దని కోరుతున్నారు. పలుమార్లు ధర్నాలు నిర్వహించడంతో పాటు అధికారులకు విజ్ఞప్తులను చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా పూర్తిస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వాయర్ ఎత్తు పెంచి నిర్మాణం చేసేందుకు భూసేకరణ కోసం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
పనులు ఆలస్యమైనా.. వేగంగా పనులు
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆలస్యమైనా.. ప్రస్తుతం ఉన్న కొండెం చెరువు ద్వారానే జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21వ ప్యాకేజీల ద్వారా సాగునీరు అందించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నారు. కాల్వలకు బదులు పైప్లైన్ల నిర్మాణం చేస్తున్న అధికారులు.. ఈ వానాకాలంలో కనీసం 50 వేల ఎక రాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు. సారంగపూర్, మెంట్రాజ్పల్లి పంప్హౌజ్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సారంగపూర్ పంప్హౌజ్ నిర్మాణ పనులు పూర్తికాగా, ఈ వారం చివరిలోపే ట్రయల్రన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రయల్రన్ కోసం అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారి, జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రయల్రన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ను నవీపేట మండలం బినోల నుంచి సారంగపూర్ వరకు టన్నెల్ ద్వారా మల్లిస్తారు. సారంగపూర్ సర్జ్పూల్లో ఏర్పాటు చేసిన పంప్ల ద్వారా నిజాంసాగర్ కాల్వల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఈ నీటిని డిచ్పల్లి మీదుగా మెం ట్రాజ్పల్లి వరకు నిజాంకాల్వల ద్వారా తరలిస్తారు. మెంట్రాజ్పల్లిలో ఏర్పాటు చేసిన పంప్ల ద్వారా నీటిని పైప్లైన్లకు మళ్లిస్తారు. ఈ రెండు పంప్హౌజ్ల లో ట్రయల్రన్ డ్రై, వెట్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సా రంగపూర్ వద్ద మూడు పంప్హౌజ్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ కాల్వలో ఎత్తిపోయనున్నారు. మెంట్రాజ్పల్లి వద్ద 10 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా నీటిని పైప్లైన్లకు మళ్లించి ఆయకట్టుకు అందిస్తారు. సారంగపూర్ పంప్హౌజ్ నుంచి నిజాంసాగర్ కాల్వ ద్వారా మాసాని చెరువుకు కొంతనీరును తరలిస్తారు. మాసాని చెరువు నుంచి మంచిప్ప వద్ద ఉన్న కొండెం చెరువుకు నీటిని మళ్లిస్తారు. అక్కడ నిర్మాణం అవుతున్న గడ్కోల్ పంపు ద్వారా సిరికొండ మండల వరకు నీటిని తరలిస్తారు. మంచిప్ప వద్ద నిర్మాణం చేస్తున్న గడ్కోల్ పంప్హౌజ్ పనులు మరో ఆరు నెలల తర్వాత పూర్తికానున్నాయి. ఈ పంప్హౌజ్ ద్వారా మోపాల్ నుంచి సిరికొండ మండలం గడ్కోల్ వరకు 85వేల ఎకరాల వరకు సాగునీటిని అందించనున్నారు. మొదట నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో మెంట్రాజ్పల్లి పంప్హౌజ్ల ద్వారా ఈ వానాకాలంలో ఆయకట్టుకు నీటిని అందించే విధంగా ప్రణాళిక సిద్దం చేశారు.
కొండెం చెరువు నుంచి నీటి తరలింపు
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం పూర్తికాకున్నా.. ప్రస్తుతం ఉన్న కొండెం చెరువులో నుంచి నీటిని తరలిస్తూ.. జిల్లాలోని సారంగపూర్, మెంట్రాజ్పల్లి, గడ్కోల్ పంప్హౌజ్ల ద్వారా సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. రిజర్వాయర్ నిర్మాణం ఆలస్యమైనా జిల్లాలో సాగునీటి సరఫరాకు ఇబ్బం దులు లేకపోవడంతో ఈ రెండు ప్యాకేజీల ద్వారా నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే కామారెడ్డి జిల్లా పరిధిలోని 22వ ప్యాకేజీకి సాగునీటిని మళ్లించనున్నారు. అప్పటి వరకు ఆ వైపు పనులు పూర్తి అయితే.. ప్రస్తుతం ఉన్న కొండెం చెరువు ద్వారానే కొంత ఆయకట్టుకు కామారెడ్డి జిల్లా పరిధిలో కూడా అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. భూసేకరణకు ఆలస్యమైనా ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ఉన్న కొండెం చెరువు ద్వారానే నీటిని అందించేందుకు సాగు నీటిపారుదల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆయకట్టుకు వానాకాలం నుంచి సాగునీరు
: మధుసూధన్రావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్, నిజామాబాద్
జిల్లాలో 20, 21వ ప్యాకేజీల కింద వచ్చే వానాకాలం నుంచి సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం ఆలస్యమైనా.. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల ద్వారానే సాగునీరు అందిస్తాం. సారంగపూర్, మెంట్రాజ్పల్లి పంపుల ద్వారా జిల్లాలో ఆయకట్టుకు మొదట నీటిని విడుదల చేస్తాం. గడ్కోల్ పంపు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ పరిధిలోని రైతులకు నీటిని అందిస్తాం. ప్రస్తుతం పైప్లైన్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ వారం చివరలోనే సారంగపూర్, మెంట్రాజ్పల్లి పైప్లైన్ల ట్రయల్రన్ చేస్తాం.