స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి

ABN , First Publish Date - 2021-01-25T04:17:48+05:30 IST

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న తెంటు లక్ష్మునాయుడు

బొబ్బిలి : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక దర్బార్‌ మహల్‌లో పార్టీ మండల సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెంటు మాట్లాడుతూ బేబీనాయన మార్గదర్శకాన మెజార్టీ పంచాయతీలను గెలుచుకునేందుకు మనమంతా సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బేబీనాయన మాట్లాడుతూ ఎంతోమంది సీఎంలతో తనకు అనుబంధం ఉందని, ఇలాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదని అన్నారు. వ్యక్తిగత కక్షసాధింపులతోనే సరిపోతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రౌతు రామ్మూర్తి, పువ్వల శ్రీనివాసరావు, కర్రి అప్పలనాయుడు, పువ్వల మాధవ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T04:17:48+05:30 IST