జగన్ కేసుల్లో వాదనలకు సిద్ధపడండి: సీబీఐ కోర్టు
ABN , First Publish Date - 2021-07-27T08:57:29+05:30 IST
జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలోని అభియోగాలపై వాదనలకు సిద్ధపడాలని ప్రత్యేక కోర్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఇతర నిందితులకు స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలోని అభియోగాలపై వాదనలకు సిద్ధపడాలని ప్రత్యేక కోర్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఇతర నిందితులకు స్పష్టం చేసింది. డిశ్చార్జి పిటిషన్లలోనూ వాదనలు చెప్పేందుకు సిద్ధపడాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీ.ఆర్. మధుసూదన్రావు స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు3కి వాయిదా వేశారు. అక్రమాస్తుల కేసుల్లో బెయిలుపై ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ వాయిదా పడింది.