శ్మశానానికి స్థలం కేటాయించాలని ముస్లింల ఆందోళన
ABN , First Publish Date - 2020-09-25T10:22:45+05:30 IST
శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింలు మృతదేహాంతో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.
కృత్తివెన్ను, సెప్టెంబరు 24 : శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింలు మృతదేహాంతో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. శ్మశాన వాటిక లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ముస్లింల శ్మశాన వాటికకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని ప్రభుత్వాధికారు లకు, పాలకులకు విజ్ఞప్తి చేశారు.