అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ABN , First Publish Date - 2020-06-01T09:32:38+05:30 IST
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కొనుగోల్లు
కుంటాల, మే 31: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కొనుగోల్లు అంతంత మాత్రంగానే కొనసాగడంతో కళ్లాలలో ధాన్యం విక్రయించేందుకు రాసులు పోసుకొని ఉన్న రైతన్నలకు ఆకస్మాత్తుగా ఆదివారం ఉదయం కురిసిన వర్షం తీరని నష్టం మిగిల్చింది.
మండలంలోని పెంచికల్పాడ్, విఠపూర్, లింబా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల చుట్టు నీరు నిలిచింది. అంతేగాకుండా బలంగా గాలి వీయడంతో ధాన్యం కుప్పలపై నుండి టార్ఫాలిన్ కవర్లు లేక పలువురి రైతుల ధాన్యం తడిసి ముద్ధయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరతున్నారు.