నిరాశ్రయులకు ప్రేమసమాజం సాయం

ABN , First Publish Date - 2021-05-08T05:16:05+05:30 IST

కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు.

నిరాశ్రయులకు ప్రేమసమాజం సాయం
ఆహారం పొట్లాలు అందజేస్తున్న ప్రేమ సమాజం కార్యదర్శి జగదీశ్వరరావు

రోజుకి వందమందికి ఆహారం పంపిణీ

విశాఖపట్నం, మే 7 : కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాబాగార్డెన్స్‌ ప్రేమ సమాజం ఆవ రణ బయట ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటల్లోగా వందమందికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కర్ఫ్యూకారణంగా ఎవరూ బయటకు రాకపోవడంతో వారంతా దీనంగా ఉంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భోజనం సరఫరా చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-05-08T05:16:05+05:30 IST