నిరాశ్రయులకు ప్రేమసమాజం సాయం
ABN , First Publish Date - 2021-05-08T05:16:05+05:30 IST
కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు.
రోజుకి వందమందికి ఆహారం పంపిణీ
విశాఖపట్నం, మే 7 : కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాబాగార్డెన్స్ ప్రేమ సమాజం ఆవ రణ బయట ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటల్లోగా వందమందికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కర్ఫ్యూకారణంగా ఎవరూ బయటకు రాకపోవడంతో వారంతా దీనంగా ఉంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భోజనం సరఫరా చేస్తున్నామన్నారు.