కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి ప్రసవం చేసిన వైద్యులు
ABN , First Publish Date - 2022-01-23T00:33:55+05:30 IST
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శనివారం వైద్యులు ప్రసవం చేశారు.
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శనివారం వైద్యులు ప్రసవం చేశారు. హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన అపర్ణ అనే గర్భిణికి పురిటినొప్పులు రాగా శనివారం తెల్లవారు జామున ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని గైనకాలజిస్టు డాక్టర్ వాణిలత సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్రావు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అపర్ణకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూశారు. అపర్ణకు పాపు జన్మించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.