పనిచేసే వారికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-19T06:01:19+05:30 IST

తెలుగుదేశంపార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్య కర్తలకే భవిష్యత్తు ఉంటుందని, పనిచేయని ప్రాధాన్యముండదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

పనిచేసే వారికే ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ఎమ్యెల్యే దుద్దుకుంట అక్రమాలను అరికట్టాలి

బాబు పర్యటనను విజయవంతం చేయండి

 మాజీమంత్రి పల్లె పిలుపు

పుట్టపరి,్త మే 18: తెలుగుదేశంపార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్య కర్తలకే భవిష్యత్తు ఉంటుందని, పనిచేయని ప్రాధాన్యముండదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని పి లుపినిచ్చారు. ఆయన బుధవారం టీడీపీ  స్థానిక కార్యాలయంలో నియో జకవర్గ స్థాయి నాయకులు, కార్య కర్తలతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా పల్లె మా ట్లాడుతూ... వైసీపీ ఢీ అంటే టీ డీపీ సై అనేలా కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. వైసీపీ పెట్టే అక్రమకేసు లకు భయపడవద్దని, మీకు నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. పార్టీని బలహీన పరచేలా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఎమ్యెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతి, భూ దందాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. నియోజక వర్గంలోని ప్రతిగ్రామంలో జగన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, సభ్యత్వ నమోదు లో నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు విజయ్‌ కుమార్‌, రామకృష్ణ, ఒలిపి శ్రీనివాసులు, మల్లిరెడ్డి, మైలే శంకర్‌, జయచంద్ర, గోపాల్‌రెడ్డి, నాయకులు మాజీ మున్సిపల్‌ చైర్మన బెస్తచలపతి, సామకోటి ఆది, సాలక్కగారి శ్రీనివాసులు, శ్రీరాంనాయక్‌, కొత్తపల్లి జయప్రకాష్‌, రామాంజులనాయుడు, ఓబులరెడ్డి, కిరణ్‌, కోనంకి గంగాధర్‌నాయుడు, దారపనేని చంద్రశేఖర్‌, ఉమాపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:01:19+05:30 IST