సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వండి : డీఎంహెచ్ఓ
ABN , First Publish Date - 2022-05-18T04:23:10+05:30 IST
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వండి : డీఎంహెచ్ఓ
మేడ్చల్, మే 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ఆపరేషన్లును తగ్గించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన శ్రీరంగవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండుసార్లు జాతీయస్థాయిలో గుర్తింపు అవార్డు రావడం సంతోషమన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మరిన్న మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.