విలువైన వజ్రం లభ్యం

ABN , First Publish Date - 2022-08-11T05:26:43+05:30 IST

వ్యవసాయ పనులు చేస్తున్న యువతికి విలువైన వజ్రం దొరికింది.

విలువైన వజ్రం లభ్యం

 రూ.34 లక్షలు, 10 తులాల బంగారుకు కొనుగోలు

తుగ్గలి, ఆగస్టు 10: వ్యవసాయ పనులు చేస్తున్న యువతికి విలువైన వజ్రం దొరికింది. బుధవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జీ ఎర్రగుడిలో వ్యవసాయ పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. జొన్నగిరి, గుత్తి తదితర ప్రాంతాల వజ్రాల వ్యాపారులు సిండికేట్‌ అయ్యి రూ.34 లక్షలు, 10 తులాల బంగారుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి జల్లులు కురిసినప్పుడు జీ ఎర్రగుడి, జొన్నగరి, ఉప్పర్లపల్లి గ్రామాల్లో విరివిగా వజ్రాలు దొరుకుతుంటాయి. గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఓ వ్యక్తికి దొరికిన వజ్రాన్ని రూ.120 లక్షలకు కొనుగోలు చేశారు. ఏటా ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. అయితే వజ్రాలను వెతికేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తుండడంతో పొలాలు నాశమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-08-11T05:26:43+05:30 IST