సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2022-08-18T06:02:22+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
ఉప్పలూరులో పర్యటిస్తున్న మలేరియా జిల్లా అధికారి రామారావు

ఉప్పలూరు (కంకిపాడు), ఆగస్టు 17: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మలేరియా జిల్లా అధికారి బి.రామారావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. మురుగు పారకుండా నిల్వ ఉంటే దోమలకు ఆవాసంగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉపకేంద్రాల్లో వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. నివాసాల పరిసరాల్లో మురుగు నిలవకుండా చూడాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఏఎంవో పి.ఎస్‌.రాజు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీని వాసరావు, హెల్త్‌ అసిస్టెంట్‌ రాచమల్ల శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:02:22+05:30 IST