తాగునీటి కోసం ముందస్తు చర్యలు
ABN , First Publish Date - 2021-02-28T05:06:00+05:30 IST
పోరుమామిళ్ల పంచాయతీలో శాశ్వత తాగునీ టి పరిష్కారానికి సర్పంచ యనమల సుధాకర్ ముం దస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
పోరుమామిళ్ల, ఫిబ్రవరి 27: పోరుమామిళ్ల పంచాయతీలో శాశ్వత తాగునీ టి పరిష్కారానికి సర్పంచ యనమల సుధాకర్ ముం దస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. శనివారం పుల్లీ డు సమీపంలోని రెండు మోటార్లకు విద్యుత తీగలు ఎత్తులోకి మార్పింపజేసి సరఫరా పునరు ద్దరింపజేశారు.
గతంలో తీగలు భూమిపై ఉండడంతో నీళ్లపైన పడి ప్రమాదాలు జరిగేవి. మూగజీవాలు సేద తీరుతున్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహనరెడ్డి పాల్గొన్నారు.