‘మనోహ’ టౌన్‌షి్‌పపై ప్రీబిడ్‌ మీటింగ్‌

ABN , First Publish Date - 2022-05-18T05:56:48+05:30 IST

‘మనోహ’ టౌన్‌షి్‌పపై ప్రీబిడ్‌ మీటింగ్‌

‘మనోహ’ టౌన్‌షి్‌పపై ప్రీబిడ్‌ మీటింగ్‌

  • టీఎ్‌సఐడీసీ జోనల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌

తాండూరు రూరల్‌, మే 17 : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద మనోహ టౌన్‌షి్‌పలో 16ప్లాట్లకు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని టీఎ్‌సఐడీసీ జోనల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మనోహ టౌన్‌ షిప్‌లో 16ప్లాట్లు వేల ం వేయడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గల వారు కొనుగోలు చేయడానికి ముందుకు రావాలన్నారు. వేలంలో పాల్గొనేందుకు రూ.5వేల ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక ప్లాట్‌కు ఈఎండీ రూ.10వేలు చెల్లించవలసి ఉంటుందన్నారు. వచ్చేనెల 8వ తేదీన మరోసారి ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా వచ్చేనెల 14.6.22న బహిరంగ వేలం నిర్వహించడ జరుగుతుందన్నారు. ఒక ప్లాట్‌ వంద స్క్వేర్‌యార్డ్స్‌ ఉంటుందని, మరింత సమాచారం కోసం  సెల్‌ : 96660-60192, 84669-66630 నెంబర్లకు ఫోన్‌ చేసి సమగ్ర వివరాలు  తెలుసుకోవచ్చన్నారు. తాండూరు డీటీ ధనంజయ, ఆర్‌ఐ రాజిరెడ్డి, రాజీవ్‌ స్వగృహ ప్రతినిధి వెంకటేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-18T05:56:48+05:30 IST