పీడీసీసీ ఉద్యోగులకు పీఆర్సీ కోసం కృషి

ABN , First Publish Date - 2020-11-29T05:29:49+05:30 IST

పీడీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగు లకు ఆప్‌కాబ్‌ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించేలా పీఆర్సీ అమలు చేసేందుకు కృషి చేస్తామని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు పి.గౌతమరెడ్డి తెలిపారు.

పీడీసీసీ ఉద్యోగులకు పీఆర్సీ కోసం కృషి



 



ఒంగోలువిద్య, నవంబరు 28 :  పీడీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగు లకు ఆప్‌కాబ్‌ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించేలా పీఆర్సీ అమలు చేసేందుకు కృషి చేస్తామని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు పి.గౌతమరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులోని పీడీసీసీ  బ్యాంకు  కార్యాలయంలో ది ప్రకాశంజిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్టాఫ్‌ యూనియన్‌ ప్రథమ మహాసభకు ఆయన వచ్చేశారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్‌ ఎం.వెంకయ్య, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు అట్లా శ్రీను, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌, బాలాజీప్రసాద్‌, శ్రీనివాసన్‌, రమణకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:29:49+05:30 IST