నిరాశను మిగిల్చిన పీఆర్సీ జీవో
ABN , First Publish Date - 2021-06-15T05:23:47+05:30 IST
నిరాశను మిగిల్చిన పీఆర్సీ జీవో
ఘట్కేసర్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవో60 మున్సిపల్ కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చిందని రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి జయచంద్ర అన్నారు. సోమవారం ఘట్కేసర్లో కార్మికులతో కలిసి పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవో60ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినదానికి, జారీ చేసిన జీవోకు పొంతనే లేదని ఆరోపించారు. రాంకుమార్, సువర్ణ, లక్ష్మి, బాలకృష్ణ, మైసయ్య, రాములు, రాజు, రవి, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.