వారం రోజుల్లో పీఆర్సీ అమలు?
ABN , First Publish Date - 2021-12-07T23:29:23+05:30 IST
వారం రోజుల్లో పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి జగన్
అమరావతి: వారం రోజుల్లో పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ కమిషనర్ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారన్నారు. ఉద్యోగులు కూడా పీఆర్సీ కోసం పదే పదే అభ్యర్థిస్తున్నారన్నారు. కరోనా మూలంగా అనేక ఒడిదుడుకులు ఎదురుకొన్నామన్నారు. పీఆర్సీ అమలుకు సుముఖంగా ఉన్నారన్నారు.