పీఆర్సీ గడువు 30 వరకు పెంపు
ABN , First Publish Date - 2020-09-19T09:01:36+05:30 IST
పీఆర్సీ గడువు 30 వరకు పెంపు
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) గడువును ఈ నెల 30 వరకు పెంచారు. పీఆర్సీ కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పదవీకాలాన్ని కూడా నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో 11వ పీఆర్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎ్సఐఆర్డీ) కమిషనర్గా నవీన్కుమార్కు పూర్తి అద నపు బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
‘భోగాపురం’ అభివృద్ధిపై కమిటీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పర్యవేక్షణకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 15 మందిని సభ్యులుగా నియమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.