సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని ప్రార్థనలు

ABN , First Publish Date - 2021-04-21T05:57:30+05:30 IST

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ ప ట్టణ అధ్యక్షుడు బాజీవుల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని ఉస్మానియా మసీద్‌లో మంగళవారం ప్రార్థనలు చేశారు.

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని ప్రార్థనలు
హుజూర్‌నగర్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

హుజూర్‌నగర్‌/ సూర్యాపేట కల్చరల్‌, ఏప్రిల్‌ 20: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ ప ట్టణ అధ్యక్షుడు బాజీవుల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని ఉస్మానియా మసీద్‌లో మంగళవారం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సాధిక్‌, యండీ రఫీ, జిలాని, సిరాజ్‌, రహమతుల్లా, బాబా, ఇమ్రాన్‌, ఇబ్రహీమ్‌, బాషా, సైఫుల్లా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని జిల్లాకేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్‌, రఫి, గట్ల శరణ్‌కుమార్‌, వేణుగౌడ్‌, చింటు, సైదానాయక్‌, మణి, వీరాంజనేయులు, ఆర్‌కె గౌడ్‌, రాముగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:57:30+05:30 IST