Pragati Bhavanలో సీఎం పీఠమే బహుజనుల లక్ష్యం కావాలి: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2022-05-13T03:11:44+05:30 IST
ప్రగతి భవన్లో సీఎం పీఠమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీ
ఖమ్మం: ప్రగతి భవన్లో సీఎం పీఠమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీ అడ్డుకోవడం వల్లనే ప్రభుత్వం దళితుల భూములను తీసుకొనేందుకు సాహసించటం లేదని పేర్కొన్నారు. ‘బతుకమ్మ చీరలు వద్దు.. రాజ్యాధికారమే ముద్దు’ అనే రీతిలో బహుజనులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వెంచర్లు వేయటానికిగానూ రాష్ట్రంలో దళితులు అనుభవిస్తున్న 28లక్షల ఎకరాలకు ఎసరు పెట్టిందని ఆరోపించారు. ఆ భూములు కోల్పోతే వాటి యజమానులంతా అడ్డా కూలీలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా, వైద్యం అందించాలని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.