మిషన్భగీరథతో కల్వకుంట్ల కుటుంబానికే లబ్ధి: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2022-05-14T03:32:51+05:30 IST
మిషన్ భగీరథ అంతా ఒక మాయని, సూమారు రూ.36వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంతో కల్వకుంట్ల కుటంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని
ఖమ్మం: మిషన్ భగీరథ అంతా ఒక మాయని, సూమారు రూ.36వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంతో కల్వకుంట్ల కుటంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. హైదరాబాద్లో రూ.100 కోట్ల భూమిని కేవలం రూ.4లక్షలకే గుంజుకున్న పార్టీ టీఆర్ఎస్ అని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్.. దళితులకు, మూడెకరాలు ఇస్తానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. రూ. 36వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం పెట్టి జేబులు నింపుకొన్నారన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సరైన వైద్య సదుపాయలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లలో ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఏం చేయలేకపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన కాలంలో ఏం చేస్తుందని ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు.