మైన్స్‌ శాఖ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆడియో టేపుల కలకలం

ABN , First Publish Date - 2022-01-17T21:40:18+05:30 IST

మైన్స్‌ శాఖ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆడియో టేపుల కలకలం రేపుతున్నాయి. మైన్స్‌ నిర్వహణ లావాదేవీల్లో తేడాలు రావడంతో ఆడియో టేపులు లీక్‌ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మైన్స్‌ శాఖ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆడియో టేపుల కలకలం

విశాఖ: మైన్స్‌ శాఖ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆడియో టేపుల కలకలం రేపుతున్నాయి. మైన్స్‌ నిర్వహణ లావాదేవీల్లో తేడాలు రావడంతో ఆడియో టేపులు లీక్‌ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చిన అభియోగాలపై ఏడీ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు అక్రమార్కులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనది, తన సతీమణి వాయిస్‌లను మార్ఫింగ్‌ చేశారని తెలిపారు. తాను అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు ఆడియో టేపులు సృష్టించారని చెప్పారు. అక్రమ మైనింగ్‌ మాఫియా సహకారంతో మైనింగ్‌ శాఖలోని కొందరు అధికారులు తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌ మాఫియాపై ఉన్నతాధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశానని వివరించారు. తాను తప్పు చేస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-01-17T21:40:18+05:30 IST