పంజాబ్‌ సీఎం సలహాదారుగా ప్రశాంత్‌ కిశోర్‌

ABN , First Publish Date - 2021-03-02T07:14:46+05:30 IST

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నియమితుడయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అమరీందర్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం

పంజాబ్‌ సీఎం సలహాదారుగా ప్రశాంత్‌ కిశోర్‌

చండీగఢ్‌, మార్చి 1: పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నియమితుడయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అమరీందర్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పని చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం ఈ విషయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ ర్యాంకు, హోదాను ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకుగాను ప్రశాంత్‌ కిశోర్‌ నెలకు రూ.1 మాత్రమే తీసుకుంటున్నారని చెప్పింది. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమరీందర్‌తో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ పని చేస్తుండడం గమనార్హం. 2017 పంజాబ్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు. ఆ పార్టీ అప్పట్లో విజయం సాధించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T07:14:46+05:30 IST