ప్రసన్నశ్రీకి ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య పురస్కారం ప్రదానం

ABN , First Publish Date - 2022-05-19T05:22:08+05:30 IST

పందొమ్మిది గిరిజన భాషలకు లిపిని చేకూర్చిన భారతీయ మహిళ ప్రొఫెసర్‌ సాతుపాటి ప్రసన్నశ్రీ అని పలువురు వక్తలు కొనియాడారు.

ప్రసన్నశ్రీకి ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య పురస్కారం ప్రదానం
పురస్కార గ్రహీతను సత్కరిస్తున్న అతిథులు

విశాఖపట్నం మే 18: పందొమ్మిది గిరిజన భాషలకు లిపిని చేకూర్చిన భారతీయ మహిళ ప్రొఫెసర్‌ సాతుపాటి ప్రసన్నశ్రీ అని పలువురు వక్తలు కొనియాడారు. పౌరగ్రంథాలయంలో ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ, ఆచార్య చందు లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ ప్రసన్నశ్రీకి బుధవారం ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్‌ ఆచార్య వి.బాలమోహన్‌దాస్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, భరణికాన రామారావు,సాహితీకారుడు చందు సుబ్బారావు చేతులు మీదుగా  పుర స్కారాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం.పైడిరాజు, ఉప్పల అప్పలరాజు, ఎ.వి.ఆర్‌.మూర్తి, పి.శ్యామ్‌సుందర్‌, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:22:08+05:30 IST