క్వార్టర్స్లో ప్రణయ్, సింధు
ABN , First Publish Date - 2022-07-01T09:42:45+05:30 IST
థామస్ కప్ స్టార్ హెచ్ఎ్స ప్రణయ్ సంచలన విజయంతో మలేసియా ఓపెన్ క్వార్టర్స్కు చేరుకున్నాడు.
కౌలాలంపూర్: థామస్ కప్ స్టార్ హెచ్ఎ్స ప్రణయ్ సంచలన విజయంతో మలేసియా ఓపెన్ క్వార్టర్స్కు చేరుకున్నాడు. మరోవైపు డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అతికష్టమ్మీద ప్రీక్వార్టర్స్ అధిగమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో వరల్డ్ నెం.4 చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)ను ప్రణయ్ 21-15, 21-7తో వరుస గేముల్లో చిత్తు చేశాడు. క్వార్టర్స్లో ఏడోసీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడనున్నాడు.
పారుపల్లి కశ్యప్ 19-21, 10-21తో కున్లావత్ విదిత్శరణ్ (థాయ్లాండ్) చేతిలో ఓడాడు. డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట.. ప్రత్యర్థి ఘోజిఫి-నూర్ ఇజాజుద్దీన్కు వాకోవర్ ఇచ్చింది. సాత్విక్కు కండరాలు పట్టేయడంతో బరిలోకి దిగలేదు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో ఏడోసీడ్ సింధు 19-21, 21-9, 21-14తో పిట్యాపోర్న్ చైవాన్ (థాయ్లాండ్)పై చెమటోడ్చి నెగ్గింది. క్వార్టర్స్లో రెండో సీడ్ తై జు యింగ్తో తలపడనుంది.