12ఏళ్ల క్రితం కాకినాడ బీచ్‌లో జరిగిన సంఘటన.. ఇప్పటికీ గుర్తుంచుకున్న NRI.. అమెరికా నుంచి వచ్చి మారీ..

ABN , First Publish Date - 2022-01-03T18:17:17+05:30 IST

తల్లిదండ్రులతో కలిసి ఆ కుర్రాడు అమెరికా నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. కొద్ది రోజులపాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. ఆ తర్వాత కాలక్షేపం కోసం సాయంత్రం వేళ.. తల్లిదండ్రులతో కలిసి పక్కనే ఉన్న కాకినాడ బీచ్‌కు వెళ్లాడు. అలలు తన పాదాలను తాకుతుంటే.. ఆనందించాడు. ఈ క్ర

12ఏళ్ల క్రితం కాకినాడ బీచ్‌లో జరిగిన సంఘటన.. ఇప్పటికీ గుర్తుంచుకున్న NRI.. అమెరికా నుంచి వచ్చి మారీ..

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రులతో కలిసి ఆ కుర్రాడు అమెరికా నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. కొద్ది రోజులపాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. ఆ తర్వాత కాలక్షేపం కోసం సాయంత్రం వేళ.. తల్లిదండ్రులతో కలిసి పక్కనే ఉన్న కాకినాడ బీచ్‌కు వెళ్లాడు. అలలు తన పాదాలను తాకుతుంటే.. ఆనందించాడు. ఈ క్రమంలోనే చల్లని సాయంత్రం వేళ వేరుశనక్కాయలు తినాలని ఆశపడ్డాడు. కొనియ్యమని తండ్రిని కోరాడు. దీంతో ఆ తండ్రి పక్కనే వ్యాపారి వద్దకు వెళ్లి, వేరుశనగ కాయలు తీసుకున్నాడు. అనంతరం తన వద్ద వ్యాలెట్ లేదని గ్రహించి.. తిరిగి వాటిని వెనక్కి ఇవ్వబోయాడు. అయితే ఆ వ్యాపారి వాటిని తీసుకోలేదు. డబ్బులు లేకుండానే ఆ కుర్రాడికి శనగకాయలు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ అబ్బాయి మర్చిపోలేదు. దానికి ప్రతిగా ఆ అబ్బాయి ఏం చేశాడనే పూర్తి వివరాల్లోకి వెళితే..



కాకినాడకు చెందిన ప్రణవ్.. 2010 తల్లిదండ్రలతో కలిసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే కాకినాడ బీచ్‌ను సందర్శించాడు. అక్కడ వేరుశనగ కాయలను ఆశపడ్డ ప్రణవ్.. తండ్రికి చెప్పి, కొనియ్యాలని కోరతాడు. దీంతో అతడి తండ్రి మోహన్ పక్కనే ఉన్న పెద్ద సత్తయ్య అనే వ్యాపారి వద్దకు వెళ్లి వేరు శనగకాయలను తీసుకున్నాడు. ఆ తర్వాత వ్యాలెట్ తీసురాలేదన్న విషయం గుర్తించి.. తిరిగి వాటిని వెనక్కి ఇవ్వబోయాడు. అయితే పెద్ద సత్తయ్య వాటిని తీసుకోలేదు. ఉచితంగా వాటిని ఇచ్చేశాడు. దీంతో ప్రణవ్.. సత్తయ్యతో కలిసి ఓ ఫొటోను తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాడు. కాగా.. బీచ్‌లో జరిగిన విషయాన్ని మాత్రం మర్చిపోలేకపోయిన ప్రణవ్.. ఇండియాకు వచ్చిన ప్రతిసారి సత్తయ్య రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాజాగా ఇండియాకు వచ్చిన ప్రణవ్.. సోషల్ మీడియా, స్థానిక ఎమ్మేల్యే సహాయంతో సత్తయ్య చిరునామను తెలుసుకున్నాడు. అనంతరం తన సోదరితో కలిసి అక్కడకు వెళ్లిన ప్రణవ్‌కు సత్తయ్య రెండేళ్ల క్రితమే చనిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రణవ్.. 12ఏళ్ల క్రితం జరిగిన దానికి ప్రతిగా రూ.25వేల రూపాయలను సత్తయ్య కుటుంబ సభ్యులకు అందజేశాడు. 




Updated Date - 2022-01-03T18:17:17+05:30 IST