Jagan reddy పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది: Pranav Gopal

ABN , First Publish Date - 2022-06-05T17:09:40+05:30 IST

జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఎంవి ప్రణవ్ గోపాల్ విమర్శించారు.

Jagan reddy పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది: Pranav Gopal

Visakha: జగన్ రెడ్డి (Jagan reddy) పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టెన్త్ పరీక్షా ఫలితాలను కూడా సక్రమంగా అందించలేని చేతగాని ప్రభుత్వం ఏపీలో ఉండటం సిగ్గుచేటన్నారు. ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో జవాబు పత్రాల గల్లంతుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు ఎలా నిర్వహించాలో, స్పాట్ వాల్యుయేషన్ ఏ విధంగా చేపట్టాలో కూడా అవగాహన లేని వ్యక్తి విద్యా శాఖ మంత్రిగా ఉండటం విద్యార్థుల దురదృష్టకరమన్నారు. గ్రూప్1 పరీక్షల మూల్యాంకనపై అభ్యర్థులకు సరైన క్లారిటీ ఇవ్వకుండా ఇంటర్వ్యూలు నిర్వహించడం పనికిమాలిన చర్యగా ప్రణవ్ గోపాల్ అభివర్ణించారు.

Updated Date - 2022-06-05T17:09:40+05:30 IST