AP News: విశాఖ: విజయసాయి ట్వీట్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-04T18:29:04+05:30 IST
విజయసాయి, దేవేంద్ర రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రణవ్ గోపాల్ విమర్శించారు.
విశాఖ (Visakha): వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) వివాదాస్పద ట్వీట్ (Tweet)లపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal), స్థానిక టీడీపీ నేతలు (TDP Leaders) విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ప్రణవ్ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ విజయ సాయి, దేవేంద్ర రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని, వారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ సోషల్ మీడియా కోర్డినేటర్ దేవేంద్ర రెడ్డి అడ్డ గాడిద అని విమర్శించారు. సీబీఐ (CBI) విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ము ఉంటే సీబీఐ విచారణ కోసం సీఎం జగన్తో లేఖ రాయించాలని అన్నారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, వైసీపీ నేతలు చర్చలకు సిద్ధమా? అంటూ ప్రణవ్ గోపాల్ ప్రశ్నించారు.