ప్రణబ్ ఇంకా వెంటిలేటర్ పైనే: ఆర్మీ ఆసుపత్రి
ABN , First Publish Date - 2020-08-15T19:59:03+05:30 IST
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యులు..
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని పేర్కొన్నారు.
'ప్రణబ్ ముఖర్జీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. వెంటలేటర్ సపోర్ట్ కొనసాగుతోంది. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది' అని ఆప్రకటనలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం సైతం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని, ఐసీయూలో వెంటలేటర్ సపోర్ట్ కొనసాగుతోందని హెల్త్ బులిటెన్లో తెలిపింది. కాగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గానే ఉన్నప్పటికీ మరీ అంత దిగజారలేదని, వెలుగుకు ఆయన కళ్లు స్పందిస్తున్నాయని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ ఒక ప్రకటనలో తెలిపారు.