వచ్చే సంవత్సరం మా నాన్న జెండా ఎగురవేస్తారు.. జై హింద్ : ఇదీ షర్మిష్ఠ ట్వీట్

ABN , First Publish Date - 2020-08-15T18:37:37+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ

వచ్చే సంవత్సరం మా నాన్న జెండా ఎగురవేస్తారు.. జై హింద్ : ఇదీ షర్మిష్ఠ ట్వీట్

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ కొన్ని అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కచ్చితంగా తన తండ్రి జాతీయ జెండాను ఎగురవేసేవారని గుర్తు చేసుకున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవపు పాత ఫొటోలను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


‘‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఊళ్లో మా నాన్న, మా మామయ్య బాల్యం నుంచే జెండాలు ఎగురవేసేవారు. అప్పటి నుంచి... స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేయడం మా నాన్న ఎప్పుడూ మానలేదు. కొనసాగుతూనే వస్తోంది. మా ఇంట్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఫొటోలను పోస్ట్ చేశా, వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కచ్చితంగా మా నాన్న జెండాను ఎగురవేస్తారు. జై హింద్’’ అని షర్మిష్ఠ ట్విట్టర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆరోగ్యం క్షీణించడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శుక్రవారం వరకూ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన ఐసీయూలోనే ఉన్నారని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. 







Updated Date - 2020-08-15T18:37:37+05:30 IST